News February 16, 2025

తాడ్వాయి: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48) అనే వ్యక్తి శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మల్లయ్య బందువుల పెళ్లి ఉండటంతో చెట్టు కొమ్మలు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే ఉన్న కరెంట్ లైన్ తీగలపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 12, 2025

ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.

News March 12, 2025

విశాఖలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

image

స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

News March 12, 2025

మారనున్న KBC హోస్ట్‌!

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

error: Content is protected !!