News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News March 9, 2026
పోచమ్మమైదాన్ జంక్షన్లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News March 9, 2026
వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

ఎనుమాముల మార్కెట్ యార్డ్లోని వేర్హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
News March 9, 2026
వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

ఎనుమాముల మార్కెట్ యార్డ్లోని వేర్హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


