News October 10, 2024

తాతయ్యబాబుకి గృహ నిర్మాణ మంత్రి అభినందనలు

image

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తాతయ్య బాబును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయనకు మంత్రి సూచించారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Similar News

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

image

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్‌ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.