News March 12, 2025

తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

image

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.

Similar News

News November 25, 2025

అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

image

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

News November 25, 2025

అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్‌స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.

News November 25, 2025

అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్‌స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.