News March 12, 2025
తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.
Similar News
News September 19, 2025
రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్ పనుల పరిశీలన

మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సోమవారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్ గర్ల్స్ భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులను ఆయన ఆదేశించారు. డార్మెంటరీలు, తరగతి గదులు, కిచెన్, టాయిలెట్లు మొదట పూర్తి చేసి దసరా నాటికి భవనం వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.
News September 19, 2025
నిరంతరాయ శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యం: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కరీంనగర్ లో ఏర్పాటు చేసిన 300 మందికి శిక్షణ ఇస్తున్న శిబిరాన్ని సందర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు అందుతున్న వసతులు, శిక్షణ నాణ్యతను పరిశీలించారు. నిరంతర ప్రయత్నం, ఫోకస్ ఉంటే విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ చెప్పారు.
News September 19, 2025
RBSK తో చిన్నారులలో ముందస్తు గుర్తింపు.. సమగ్ర సంరక్షణ

పిల్లల ఆరోగ్య భద్రతకు PDPL జిల్లాలో RBSK కార్యక్రమం సమర్థంగా అమలవుతోంది. 18ఏళ్ల లోపు పిల్లల్లో 4D’s లోపాలు, వ్యాధులు, అభివృద్ధి లోపాల ముందస్తు గుర్తింపు, చికిత్స కోసం 10మొబైల్ హెల్త్ బృందాలు పనిచేస్తున్నాయి. లక్ష్యం 2,39,594లో 2,35,800 మందిని స్క్రీనింగ్ చేసి, 35,655 మందిలో వ్యాధులు గుర్తించారు. వీరిలో 29,118 మందికి తక్షణ చికిత్స అందించగా, 6,537 మందిని రిఫర్ చేశారు. అందులో 5,527 మంది కోలుకున్నారు.