News March 12, 2025

తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

image

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.

Similar News

News October 28, 2025

రేపు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. తుఫాను తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

బాపట్ల జిల్లాలో తుపాన్ ప్రభావం నేపథ్యంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాన్‌ వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు సూచనల మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను ఆదేశించారు. వాగుల వద్ద ప్రజలు రోడ్లు దాటకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News October 28, 2025

పెద్దపల్లి: ‘100% ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ చేయాలి’

image

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని 100% ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కింగ్ చేసిన ఇండ్లు కనీసం బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని, లబ్ధిదారులకు రుణ సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా సహాయం అందించాలని సూచించారు. నిర్మాణంలో ఆలస్యం చేసినవారి ఇండ్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. పనులను పర్యవేక్షించి, బిల్లుల చెల్లింపులు సమయానికి చేయాలని ఆదేశించారు.