News February 16, 2025

తాత్కాలికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విరామం ప్రకటించామని కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, మూడు రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

Similar News

News March 15, 2025

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

image

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 15, 2025

గ్రహాంతరవాసులపై షాకింగ్ విషయాలు

image

గ్రహాంతరవాసులున్నారా అన్న ప్రశ్నకు అమెరికా మాజీ నిఘా, సైనికాధికారులు ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘1940ల నాటి నుంచీ గ్రహాంతరవాసులు గుర్తుతెలియని ఎగిరే వాహనాల్లో(UAP) భూమిపైకి వస్తున్నారు. మన సాంకేతిక పురోగతిని పరిశీలిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు గంటకు 50వేల కి.మీ పైగా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని మానవమాత్రులు తయారుచేయలేరు’ అని స్పష్టం చేశారు.

News March 15, 2025

విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

image

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

error: Content is protected !!