News March 19, 2025
తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమెరికాలోని మిచిగన్లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.
News March 2, 2026
కుసుమ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాసంగి పంటగా విత్తుకున్న కుసుమ.. నాటిన సమయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల ఇది కోత దశలో ఉంది. అయితే ఈ కుసుమ పంటను ఉదయాన్నే కోయడం వల్ల గింజలు రాలడం తక్కువగా ఉండటమే కాకుండా ముల్లు మొత్తగా ఉండి కోత ప్రక్రియ ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట కోత తర్వాత గింజలలో తేమ 5 నుంచి 8 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టాలి. దీని వల్ల గింజ నాణ్యత బాగుంటుందని తెలిపారు.
News March 2, 2026
ఏలూరు: అత్యాచారానికి పాల్పడిన యూట్యూబర్ అరెస్ట్

జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


