News February 24, 2025

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

image

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.

Similar News

News September 18, 2025

ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News September 18, 2025

ఆదిలాబాద్: అత్యవసరమైతే 8712659953 నంబర్‌కు కాల్ చేయండి!

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్‌ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News September 18, 2025

GDK: ‘నిజాం రాచరికాన్ని ఓడించింది కమ్యూనిస్టులే’

image

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు- వక్రీకరణలు’ అనే అంశంపై గురువారం సదస్సు జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు BJPకి లేదన్నారు. ఎర్రవెల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్, మహేశ్వరి, కుమారస్వామి, బిక్షపతి, శ్రీనివాస్, రాజమౌళి ఉన్నారు.