News September 14, 2024
తానూర్: వినాయకునికి 108 రకాల నైవేద్యం

తానూర్ మండలం బోసి గ్రామంలో వినాయక నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకునికి శుక్రవారం ఏడవ రోజు భక్తులు భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్గా..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్ను గ్రామ ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.
News December 20, 2025
గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: వ్యవసాయ సమస్యలపై కలెక్టర్ చర్చ

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో రైతులు, సంబంధిత అధికారులతో కలిసి సొయాబిన్ పంట కొనుగోళ్లు, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఇతర వ్యవసాయ సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించారు. సమావేశంలో రైతుల తరపున పలువురు నాయకులు మార్కెట్లో సొయాబిన్ పంట కొనుగోలు సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అధిక వర్షాల కారణంగా పంట రంగు మారడం, మద్దతు ధర ప్రకారం రైతులను ఆదుకోవాలన్న అంశాలను వివరించారు.


