News July 18, 2024

తాళ్లూరు: బావిలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బుధవారం కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి పంజాబ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పొలం వద్ద బావిలో నీరు తాగేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

image

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్‌ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.

News November 22, 2025

ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

image

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్‌ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.

News November 22, 2025

ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.