News January 19, 2025

తిక్కారెడ్డి సంచలన కామెంట్స్

image

టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటూ కర్నూలు <<15188222>>జిల్లా <<>>టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రూ.5లక్షలకు డీలర్‌షిప్‌లు, నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు.. కామెంట్ చేయండి.

Similar News

News February 18, 2025

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

image

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

News February 17, 2025

కర్నూలులో 38°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత నమోదైంది.

News February 17, 2025

కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!