News February 21, 2025
తిప్పర్తి: కరెంట్ షాక్తో చెట్టు మీదే వ్యక్తి మృతి

కరెంట్ షాక్తో మేకల కాపరి మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషా(48) మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. వాటి మేత కోసం తుమ్మచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చెట్టు మీదనే మృతి చెందాడు.
Similar News
News February 23, 2025
SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.
News February 23, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

✓ SLBC టన్నెల్ పైకప్పు కూలి సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ✓ G- 20 సదస్సుకు ఎంపికైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి ✓ కేతేపల్లిలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్ల మృతి ✓ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు ✓ తప్పుడు వార్త రాసిన విలేకరిపై చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవో
News February 22, 2025
హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.