News November 22, 2024
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన ఆలయ మాడవీధులలో పర్యటించారు. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచమి తీర్థమనాడు పుష్కర స్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వారు తీసుకోవాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News September 14, 2025
పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 13, 2025
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News September 13, 2025
బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరుగుతుందన్నారు.