News November 5, 2024
తిరుపతిలోకి చిరుతపులులు చొరబడకుండా నియంత్రించాలి

తిరుపతి నగర పరిధిలోని జనావాస సాల్లోకి చిరుత పులులు చొరబడకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అటవీశాఖ అధికారులను కోరారు. తిరుపతి నగర సమీపంలోని అటవీ శాఖకు సంబంధించిన బయోట్రిమ్ ను మంగళవారం సందర్శించారు. బయో ట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందరన్, డీఎఫ్ఓ పవన్ కుమార్ రావుతో చర్చించారు. జనావాస సాల పరిధిలో అటవీ సరిహద్దులో ప్రహరీ నిర్మించేందుకు సాధ్య, సాధ్యాలను ఆమె కోరారు.
Similar News
News November 16, 2025
కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
News November 16, 2025
చిత్తూరు DRO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి బుధ, గురువారాల్లో HODలతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి గ్రీవెన్స్ల పరిష్కారంపై దృష్టిసారించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 15, 2025
పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.


