News November 5, 2024
తిరుపతిలోకి చిరుతపులులు చొరబడకుండా నియంత్రించాలి

తిరుపతి నగర పరిధిలోని జనావాస సాల్లోకి చిరుత పులులు చొరబడకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అటవీశాఖ అధికారులను కోరారు. తిరుపతి నగర సమీపంలోని అటవీ శాఖకు సంబంధించిన బయోట్రిమ్ ను మంగళవారం సందర్శించారు. బయో ట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందరన్, డీఎఫ్ఓ పవన్ కుమార్ రావుతో చర్చించారు. జనావాస సాల పరిధిలో అటవీ సరిహద్దులో ప్రహరీ నిర్మించేందుకు సాధ్య, సాధ్యాలను ఆమె కోరారు.
Similar News
News November 15, 2025
పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.
News November 15, 2025
కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.
News November 14, 2025
అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.


