News March 11, 2025
తిరుపతిలో అత్తను చంపిన అల్లుడి అరెస్ట్

తిరుపతి చిన్నగుంటలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న గోపాల్ రెడ్డి భార్య ప్రమీల పాచిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె అల్లుడు రవీంద్ర నాయక్ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మద్యాన్ని డబ్బులు ఇవ్వాలని ఆమెను కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ప్రమీలను కట్టేసి కాళ్లతో తన్ని గొంతు నులిమి హత్య చేశాడు.
Similar News
News March 12, 2025
4 నెలల్లో ₹86లక్షల కోట్లు ఆవిరి.. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన భారత వాటా

నిఫ్టీ, సెన్సెక్స్ క్రాష్తో గత 4 నెలల్లోనే రూ.86లక్షల కోట్ల ($1T) మార్కెట్ విలువ నష్టపోయిందని బ్లూమ్బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో ప్రపంచ మార్కెట్ విలువలో భారత వాటా తగ్గిపోయింది. 20 రోజుల సగటు లెక్కింపు ప్రకారం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది 4% ఉన్న ఈ విలువ ఇప్పుడు 3%కు పడిపోయింది. సాధారణంగా సంక్షోభం తర్వాత 70 రోజుల్లో రికవరీ బాట పట్టే సూచీలు అనిశ్చితితో వరుసగా 5 నెలలు నష్టాల్లో ముగిశాయి.
News March 12, 2025
విప్లు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే ఎందుకు స్పందించలేదని సీఎల్పీ మీటింగ్లో వారికి క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ విప్లు పనితీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సభ్యుడు ఒక్కో విషయాన్ని పంచుకోవాలని సూచించారు. సభకు సభ్యులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.
News March 12, 2025
VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబరు 14405 కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.