News March 11, 2025
తిరుపతిలో అత్తను చంపిన అల్లుడి అరెస్ట్

తిరుపతి చిన్నగుంటలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న గోపాల్ రెడ్డి భార్య ప్రమీల పాచిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె అల్లుడు రవీంద్ర నాయక్ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మద్యాన్ని డబ్బులు ఇవ్వాలని ఆమెను కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ప్రమీలను కట్టేసి కాళ్లతో తన్ని గొంతు నులిమి హత్య చేశాడు.
Similar News
News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News March 27, 2025
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్.. దరఖాస్తులకు ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం 2025-26 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎస్సీ విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నర్సింహస్వామి బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణకొరియా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ చదివేందుకు ఈ అవకాశం అని పేర్కొన్నారు. SHARE IT.
News March 27, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.