News December 18, 2024

తిరుపతిలో కాకినాడ యువకుడి సూసైడ్

image

శంఖవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకుడు తిరుపతి రూరల్ అవిలాలలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పి. రాజేశ్ జీవనోపాధికోసం తిరుమలకు వచ్చి ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువతిని ప్రేమించి ఆమెకు చెప్పాడు. ఆమె అంగీకరించలేదని మంగళవారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 20, 2025

యువకుడితో మృతితో పేరవరంలో విషాద ఛాయలు

image

ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్‌పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News January 20, 2025

నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య

image

తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 20, 2025

మారేడుమిల్లి ‘గుడిసె’ ప్రవేశానికి రేట్లు ఇవే

image

ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి మండలంలోని గుడిసె హిల్ స్టేషన్‌కు వెళ్లేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన టోల్ గెట్‌లో చెల్లించవలసిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఫోర్ వీలర్‌కు రూ. 300, టు వీలర్‌కు రూ. 100, ప్రతీ వ్యక్తికి రూ. 100 ప్రవేశ రుసుము చెల్లించాలి. వీడియో కెమెరాకు రూ.1000, డ్రోన్ కెమెరాకు రూ. 2000 చెల్లించాలి. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 500 ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు.