News March 31, 2025

తిరుపతిలో కిడ్నాప్ కథ సుఖాంతం

image

తిరుపతి జీవకోనకు చెందిన రాజేశ్ కుటుంబాన్ని రెండు రోజుల క్రితం రూ.2 కోట్ల కోసం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ సమయంలో రాజేశ్ తప్పించుకోగా.. ఆయన తల్లి విజయలక్ష్మి కూడా కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్నారు. కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రావడంతో రాజేశ్ భార్య సుమతి, ఇద్దరు పిల్లలను కిడ్నాపర్లు బెంగళూరులో వదిలిపెట్టారు. 

Similar News

News September 17, 2025

నిర్మల్: స్వచ్ఛతాహి సేవ పోస్టర్ల ఆవిష్కరణ

image

నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య స్వచ్ఛతాహి సేవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు ఉన్నారు.

News September 17, 2025

వ్యాధులు రాకుండా పరిక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

image

అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరిక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజలకు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలో స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్ కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్కీనింగ్ పరిక్షలు చేయించుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిక్షలు చేస్తారన్నారు.

News September 17, 2025

ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

image

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.