News September 5, 2024

తిరుపతిలో ఘనంగా గురుపూజోత్సవం

image

తిరుపతి నగరంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాశ్, పులివర్తి నాని, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజ మార్గనిర్దేశకులు గురువులేనని తెలిపారు.

Similar News

News December 4, 2025

రూ.5 లక్షలకు అఖండ టికెట్‌ను కొనుగోలు చేసిన చిత్తూరు MLA

image

విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టును చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి సినిమా టికెట్టును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. బాలకృష్ణ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News December 4, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

News December 4, 2025

చిత్తూరు జిల్లా అధికారులను అభినందించిన పవన్ కళ్యాణ్

image

చిత్తూరు పర్యటనలో DyCM పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనలను అధికారులు పూర్తిగా పాటించారు. బోకేలు, శాలువాలు, ఫ్రూట్ బాస్కెట్లు ఇవ్వడం లాంటివి ఎవరూ చేయలేదు. ఇవన్నీ ఉద్యోగులకూ, ప్రభుత్వ నిధులకూ భారం అవుతాయని, అలాంటి మర్యాదలు వద్దని పవన్ కళ్యాణ్ ముందే పలుమార్లు సూచించారు. ఈ నియమాన్ని విధేయంగా అమలు చేసినందుకు అధికారులను ఆయన అభినందించారు. పార్టీ నేతలకూ ఇలాంటి ఖర్చులను సేవా కార్యక్రమాలకు మళ్లించాలని సూచించారు.