News June 4, 2024
తిరుపతిలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూములు

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము తలుపులు తెరుచుకున్నాయి. పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, వీడియో, ఫోటో రికార్డింగ్ నడుమ ఓపెన్ చేశారు. మరికాసేపట్లో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.
Similar News
News October 26, 2025
చిత్తూరు జిల్లా స్పెషల్ అధికారిగా గిరీష నియామకం

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా పీఎస్ గిరీషను నియమించింది. వర్షాల ప్రభావం తగ్గే వరకు ఆయన విధుల్లో ఉండనున్నారు. జిల్లాకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News October 26, 2025
నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.
News October 26, 2025
చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.


