News March 16, 2025
తిరుపతిలో దారుణం..!

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2025
చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 16, 2025
చిత్తూరులో చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలోని పలు దుకాణాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బాయిలర్ కోడి కిలో రూ.114, లేయర్ కోడి రూ.90గా పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. కాగా బాయిలర్ కోడి మాంసం కేజీ. రూ.165, స్కిన్ లెస్ కేజీ రూ.185, లేయర్ కోడి మాంసం కేజీ రూ.153 పలుకుతోంది. మీ ప్రాంతాలలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 16, 2025
TDP నేతలపై MLA థామస్ ఆగ్రహం

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు.