News March 20, 2025
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని రెండు మూడు రోజుల క్రితం హత్య చేశారు. మృతుడు మొఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతుడు వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు, క్లూస్ టీం బృందం పరిశీలించింది.
Similar News
News March 29, 2025
మూడు రోజులు సెలవులే!

ఐటీ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం (ఉగాది) వీకెండ్ కాగా రంజాన్ సందర్భంగా సోమవారం కూడా సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్ను వీడి సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరేమో మూడు రోజులు ట్రిప్స్ లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు బయల్దేరారు. కొందరికి రంజాన్కు సెలవు ఇవ్వలేదని చెబుతున్నారు. మీ ఆఫీసుల్లో సెలవుందా? ఎటైనా వెళ్తున్నారా? COMMENT
News March 29, 2025
రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPనే: లోకేశ్

AP: రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPకే సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘NTR అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారు. మన పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు’ అని పార్టీ ఆవిర్భావ సభలో తెలిపారు.
News March 29, 2025
నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

KMM: ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల సంబంధిత SC నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారంను సంబందిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.