News March 29, 2025
తిరుపతిలో రూ.2 కోట్ల కోసం కుటుంబం కిడ్నాప్

తిరుపతి జీవకోనకు చెందిన రెండు కుటుంబాలను నగదు కోసం కిడ్నాప్ చేసిన సంఘటన శనివారం కలకలం రేపింది. జీవకోనకు చెందిన విజయ్, రమేశ్ కుటుంబ సభ్యులను కొందరు కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. బాధితులు చిత్తూరులో తమ కుటుంబ సభ్యులు ఉన్నారని, అక్కడికి వెళ్తే నగదు ఇస్తామని కిడ్నాపర్లు నమ్మబలికారు. ఐతేపల్లె వద్ద రాజేశ్ కారు నుంచి కిందికి దూకేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
వనపర్తి: ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు: పరిశీలకులు

వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
News November 28, 2025
వనపర్తి : నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేయొద్దు: కలెక్టర్

జిల్లాలో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నా, వేసిన అభ్యర్థిని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేసినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. దీనిపై నిఘా పెట్టేందుకు అధికారులతో స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఉపసంహరణ తర్వాత ఒకే నామినేషన్ మిగిలితే, స్పెషల్ సెల్ ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు.


