News August 22, 2024
తిరుపతిలో రూ.50 లక్షల విలువైన గంజాయి సీజ్

రూ.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ సీఐ సాదిక్ అలీ తెలిపారు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పోలీసులను చూసి అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోయారని వెల్లడించారు.
Similar News
News November 26, 2025
చిత్తూరు జిల్లా విభజన.. వాళ్లకు నిరాశే!

చిత్తూరు జిల్లా విస్తీర్ణం తగ్గిపోనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని 6మండలాలను మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్లోకి వెళ్తాయి. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు పీలేరు డివిజన్లో చేర్చుతారు. పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పాన్ని తిరుపతిలో కలపాలనే డిమాండ్ను పట్టించుకోలేదు.
News November 26, 2025
చిత్తూరు జిల్లా విభజన.. వాళ్లకు నిరాశే!

చిత్తూరు జిల్లా విస్తీర్ణం తగ్గిపోనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని 6మండలాలను మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్లోకి వెళ్తాయి. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు పీలేరు డివిజన్లో చేర్చుతారు. పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పాన్ని తిరుపతిలో కలపాలనే డిమాండ్ను పట్టించుకోలేదు.
News November 26, 2025
చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటర్ల జాబితా క్లెయిమ్ల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ నెలకు గాను మంగళవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో డీఆర్ఓ సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.


