News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News December 17, 2025
ఇందల్వాయి: కాల్పులు కాదు… రాడ్తో దాడి: పోలీసులు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే లారీ డ్రైవర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా నిందితులు రాడ్తో దాడి చేయడంతోనే సల్మాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. పాత కక్ష్యల కారణంగా దాడి చేశారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.
News December 17, 2025
BREAKING: NRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గొల్లపల్లి గేటు సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News December 17, 2025
పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో

ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ట్రైనింగ్, కెప్టెన్ అప్గ్రేడ్లను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో నెలకు 35-40 మందిని కెప్టెన్లుగా ప్రమోట్ చేసిన సంస్థ, ఈ ఏడాది 10-12 మందికే పరిమితమైంది. ఇక జనవరి నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో అప్గ్రేడ్లు ప్రారంభించనుంది. అయితే కొత్త కెప్టెన్లు 18-24 నెలల పాటు వేరే బేస్లో పనిచేయాలి. మధ్యలో వెళ్లిపోతే రూ.20-30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.


