News January 12, 2025
తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి.. నిజమిదే

తిరుపతిలో శనివారం ముని కుమార్ అనే టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పులి దాడి చేయలేదని బాధితుడు తెలిపాడు. అతను డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా సైన్స్ సెంటర్ సమీపంలో పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లడం చూశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న డీఎఫ్ వో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News February 19, 2025
నెల్లూరు: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

జిల్లాలోని గూడూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, కోట, ఆత్మకూరు, వెంకటగిరి, S.పేట, N.పేట న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత ఒక ప్రకటన తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.
News February 19, 2025
నెల్లూరు: రూ.1,566 కోట్ల పెట్టుబడి.. 400మందికి ఉపాధి

రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 22726 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పలు పరిశ్రమలు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు SIPC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న SIPC భేటీలో ఆమోదించాల్సి ఉంది. కృష్ణపట్నంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ (రిలయన్స్) రూ.1,566 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్కు స్థాపించనుంది. దీంతో 400 మందికి ఉపాధి కలగనుంది.
News February 19, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

నెల్లూరు నగరంలోని కపాడిపాలెంకు చెందిన షేక్ కరీముల్లాకు పోక్సో కేసులో పదేళ్ల జైలు శిక్ష రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 4, 2015 నగరంలోని సంతపేట చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుడ్ ట్రైల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణ కాంత్ అభినందించారు.