News February 3, 2025
తిరుపతిలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్

తిరుపతి పట్టణంలో 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News February 14, 2025
తిరుపతి: రైలు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 14, 2025
దివాన్ చెరువు: లారీ డ్రైవర్ పై దుండగులు దాడి

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్ చంద్రుడు దివాన్చెరువు పండ్లమార్కెట్ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2025
అనకాపల్లి: పతనమైన టమాటా ధర

నాలుగు రోజుల నుంచి టమాటా ధర దారుణంగా పడిపోయింది. ఈ వారం మొదట్లో 30 కేజీల గల క్రేట్ రూ.150 వరకు పలకగా గురువారం ఉదయం రూ.50కి కూడా కొనే నాథుడే లేడు. దీంతో టమాటా రైతులు దయనీయస్థితి ఎదుర్కొంటున్నారు. గొలుగొండ మండలంలోని రైతులు గురువారం కృష్ణదేవిపేటకు టమాటాలను తరలించినప్పటికీ కొనుగోలుదారులు లేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో అమ్మేవాడు తప్పా కొనేవాడు లేని పరిస్థితి నెలకొంది.