News July 25, 2024

తిరుపతి: అన్నతో మద్యం తాగి.. వదిన, కూతుళ్లను చంపాడు

image

తిరుపతి పద్మావతి నగర్‌‌కు చెందిన టీపీ దాస్, మోహన్(35) అన్నాదమ్ముళ్లు. మోహన్‌ ఇటీవల రెండో పెళ్లి చేసుకోగా.. ఆమె వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయాడు. నిన్న సాయంత్రం అన్నతో కలిసి మద్యం తాగాడు. తరువాత దాసు బయటకు వెళ్లాడు. అప్పుడే ట్యూషన్‌ నుంచి వచ్చిన అన్న భార్య సునీత(40), కూతుళ్లు దేవశ్రీ(13), నీరజ(10)లను మోహన్ కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

News July 5, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్‌పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.

News July 5, 2025

చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

image

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.