News July 25, 2024
తిరుపతి: అమృత్ స్టేషన్ల జాబితాలో 10 రైల్వేస్టేషన్లు ఎంపిక
తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో 10 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తిరుపతి, రేణిగుంట, పాకాల, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం గూడూరు, సూళ్లూరుపేట స్టేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిని ఆధునికరించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
Similar News
News October 1, 2024
తెలంగాణ DSCలో పలమనేరు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్
తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ-24 ఫలితాలలో పలమనేరుకు చెందిన తహసీనా ప్రతిభ చూపింది. తహసీనా 75.57 శాతం మార్కులతో ఉర్దూ మీడియంలో తొలి ర్యాంకు సాధించింది. విద్యార్థిని తండ్రి సుందర్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ టాపర్గా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.
News October 1, 2024
చిత్తూరు: ‘నవంబర్ 15 లోపు అందజేయాలి’
ST గ్రామాలలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేనివారికి నవంబర్ 15లోపు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాటి మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 588 హాబిటేషన్లో సుమారు 60 వేల మంది ఉన్నారని.. వారికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నట్టు కలెక్టర్ చెప్పారు. వాటిపై చర్యలు చేపట్టాలన్నారు.
News September 30, 2024
తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.