News November 14, 2024

తిరుపతి: ఆమె చనిపోయిందని చెప్పింది కుక్కనే..!

image

ఏర్పేడు మండలం బండారుపల్లిలో కరెంట్ షాక్ తగిలి యశోద మృతిచెందిన విషయం తెలిసిందే. పశువుల గడ్డి కోసం వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా కరెంట్ వైర్లు తగిలి చనిపోయారు. ఆ సమయంలో ఆచుట్టు పక్కల ఎవరూలేరు. ఆమె వెంట వచ్చిన కుక్కనే గట్టిగా కేకలు వేస్తూ అటూఇటూ తిరిగింది. ఇది గమనించిన గ్రామస్థులు కరెంట్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థులు అక్కడికి వచ్చిన తర్వాత ఆ కుక్క యశోద ఒడి వద్ద అలా ఉండిపోయింది.

Similar News

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

News October 19, 2025

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

image

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.

News October 19, 2025

నేడు చిత్తూరులో ముగింపు సమావేశం

image

జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై నెలరోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. నేడు జీఎస్టీ 2.0 ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.