News March 6, 2025

తిరుపతి: ఇంటర్ పరీక్షలకు 33228 మంది హాజరు

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్, ఓకేషనల్ కలిపి 33,228 మంది హాజరైనట్టు ఆర్ఐవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జనరల్ 86 కేంద్రాల్లో 32830 మందికి 849 మంది గైర్హాజరు కాగా 31981 మంది హాజరైయ్యారు. ఓకేషనల్ 15 కేంద్రాల్లో 1341 మందికి గాను 94 మంది గైర్హాజరయ్యారు కాగా 1247 మంది హాజరైయ్యారు. మొత్తం 34171 మందికి గాను 943 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు.

Similar News

News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

News March 26, 2025

ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. రేపు ఢిల్లీలో DCC అధ్యక్షులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ పోటీచేయడంతో మాజీ DCC అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డిలను సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రేసులో ADB అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది, TPCC ప్రధానకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ZPTC గణేశ్‌రెడ్డి తదితరులున్నట్లు సమాచారం.

News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

error: Content is protected !!