News February 27, 2026
తిరుపతి: ఇంటర్ పరీక్ష.. 181 మంది గైర్హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.
Similar News
News April 20, 2026
సిద్దిపేట: జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

జగిత్యాలలో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్, హరీశ్ రావులు పరిశీలించారు. నేడు జరగనున్న ఈ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు, కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నారు.
News April 20, 2026
హార్ముజ్లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.
News April 20, 2026
NLG: నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్ధులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థుల కోసం అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు


