News April 9, 2025

తిరుపతి: ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..! 

image

స్కూటర్ దొంగతనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులు వెల్లడించారు. నెల్లూరు(D) రాపూరు(M) గండవోలు పంచాయతీకి చెందిన ప్రసాద్ రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై కంపెనీ బయట ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 1, 2025

ఆదిలాబాద్: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

News December 1, 2025

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులు అవస్థలు

image

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూడు లైన్ల రోడ్లు ఉన్నా సరే నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని దినాలు ఉండటంతో ఆ సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్‌లోనే పోగొట్టుకుంటున్నామని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధ పడుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.

News December 1, 2025

కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.