News March 11, 2025

తిరుపతి: ఏప్రిల్ 2 నుంచి దూరవిద్య పరీక్షలు

image

తిరుపతి ఎస్వీయూ దూర విద్యా విభాగ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పరీక్షలను మూడుసార్లు వాయిదా వేయగా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే పదో తరగతి పరీక్షల కారణంగా నిర్వహించలేమని అధికారులు చెప్పారు. ఏప్రిల్ 2 నుండి పరీక్షలు జరపాలని హైకోర్టు సూచించింది.

Similar News

News February 9, 2026

NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>NCERT <<>>117 అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, Assist. ప్రొఫెసర్, Assist. లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. సైట్: www.ncert.nic.in

News February 9, 2026

ASF: జనసేన బోణీ కొడుతుందా?

image

ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక ప్రజల మద్దతు లేక యూ టర్న్ తీసుకుంటుందా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నడుస్తున్న వేళ జనసేన ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

News February 9, 2026

BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.