News March 30, 2024
తిరుపతి: ఏప్రిల్ 3న స్పాట్ అడ్మిషన్లు

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎడ్ (B.Ed), బిఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులో ఖాళీగా ఉన్న 51 సీట్లుకు, ఏప్రిల్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని పేర్కొన్నారు. APED CET- 2023 అర్హత పొంది ఏ కళాశాలలో అడ్మిషన్ పొందనివారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Similar News
News February 8, 2026
హాస్టళ్లకు సమస్యల గ్రహణం.. ఇప్పుడన్న వీడేనా.?

జిల్లాలో మొత్తం 113 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. పలు హాస్టల్స్లో సమస్యలు తిష్ట వేశాయి. వీటిని నెట్ జీరో ప్రాంగణాలుగా తీర్చిదిద్దేలా కలెక్టర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, విద్యుత్, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలని సూచించారు. ఇందుకోసం నివేదికలు అందజేయాలని సూచించారు. ఇకనైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
News February 8, 2026
చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.
News February 8, 2026
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్సు స్టాండ్ లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులలో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


