News February 13, 2025
తిరుపతి: కంప్యూటరైజేషన్తో రైతులకు సేవలు- కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు అందించనుందని ఆయన అన్నారు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు.
Similar News
News November 10, 2025
అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన

వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న మహిళా క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ జాగ్రత్తలు చెప్పారు. ‘మీకు ఇస్తామని చెప్పిన అవార్డులు, రివార్డులు అందకుంటే నిరుత్సాహపడకండి. విజేతల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. ఈ సిగ్గులేని వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దీనికి బాధపడొద్దు’ అని సూచించారు. గతంలో 1983 మెన్స్ టీమ్కూ ఇలాంటి హామీలు వచ్చాయని తెలిపారు.
News November 10, 2025
జగిత్యాల: ‘రూ.100 కోట్ల భూకబ్జాపై విచారణ వేగవంతం చేయండి’

జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జాపై వేగవంతంగా విచారణ జరపాలని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కొత్త బస్టాండ్ పరిసర సర్వే నం.138 సహా పలు భూములు అన్యాక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించబడితే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై వివిధ రాజకీయ వర్గాల మద్దతు లభిస్తోంది.
News November 10, 2025
ఏయూ: ఎంసీఏ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఏయూ పరిధిలోని మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి పరీక్షలు వెబ్సైట్లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పరీక్షలు విభాగం అధికారులు తెలిపారు.


