News February 13, 2025

తిరుపతి: కంప్యూటరైజేషన్‌తో రైతులకు సేవలు- కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో  సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు అందించనుందని ఆయన అన్నారు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు.

Similar News

News November 28, 2025

సుబ్రహ్మణ్యం కస్టడీ కోరుతూ సీబీఐ సిట్ పిటీషన్

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ29 టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యంను కస్టడీ కోరుతూ సీబీఐ సిట్ పిటీషన్ దాఖలు చేసింది. కస్టడీ తీసుకుని కేసులోని మరిన్ని వివరాలు సేకరించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ సమర్పించింది. సోమవారం లేదా మంగళవారం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

News November 28, 2025

NZB: ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయాల సేకరణ

image

వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయ సేకరణ జరిపారు. IDOCలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, విత్తన డీలర్లు, కంపెనీలు, విత్తన ఉత్పత్తిదారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బిల్లులోని అంశాలపై చర్చించారు. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన నాసిరకం విత్తనాల కారణంగా పంట ఉత్పత్తి, విక్రయ దశ, నష్టపరిహారం అందించే అంశాలపై చర్చించారు.

News November 28, 2025

ఉంగుటూరు: సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

CM చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మెన్ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి, SP కిషోర్‌తో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం గొల్లగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతాన్ని పరిశీలించారు.