News December 10, 2024
తిరుపతి కలెక్టర్కు 696 ఫిర్యాదులు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 32 సదస్సులలో సమస్యలపై 696 ఫిర్యాదులు అందినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలిన వాటిని సంబంధిత అధికారులు త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
Similar News
News January 15, 2025
ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఏర్పేడు మండలం మేర్లపాక హైవే సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఏర్పేడు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిది నెల్లూరు నగరంలోని స్టోన్హౌన్పేటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 14, 2025
చంద్రగిరి: భయంతో బాలుడు ఆత్మహత్య
చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 14, 2025
చంద్రగిరి: మంచి మనసు చాటుకున్న సీఎం
నారావారిపల్లెలో CM చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. CM వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు.. సమస్య ఏంటని అడిగారు. తన పేరు నాగరాజమ్మ (62), భర్త సుబ్బరామయ్య అని తెలిపారు. పక్షవాతంతో సుమారు 5 సం. నుంచి బాధపడుతున్నానని తెలిపారు. వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.