News April 4, 2024
తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్.. చిత్తూరు ఎస్పీగా మణికంఠ

చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా 2018..IPS బ్యాచ్కి చెందిన మణికంఠ చందోలును నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ని నియమించింది.
Similar News
News October 26, 2025
నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.
News October 26, 2025
చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.
News October 26, 2025
చిత్తూరు: నేడు సర్టిఫికెట్ల పరిశీలన

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవితా కేంద్రాలలో పనిచేస్తున్న సహిత విద్య రిసోర్స్ పర్సన్ల సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. వారికి రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించనున్నట్లు తెలిపారు. పరిశీలనకు తప్పక హాజరు కావాలన్నారు.


