News March 22, 2025
తిరుపతి కలెక్టర్ చేతుల మీదుగా వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ

వరల్డ్ వాటర్ డే సందర్భంగా శనివారం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా కలెక్టరేట్లో వాటర్ బ్రోచర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని తాగాలని తెలిపారు. అనంతరం IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్ను కనుగొన్న సైంటిస్ట్ డాక్టర్ షిహాబుద్దీన్ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 25, 2025
అన్నమయ్య జిల్లాలో ఒక్కో విద్యార్థికి రూ.3వేలు

అన్నమయ్య జిల్లాలోని పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా సాధారణ పరీక్షా మండలి కార్యదర్శి తాటిపర్తి గంగాధరం సోమవారం తెలిపారు. విద్యార్థులకు చేయూతగా రవాణా భత్యంను మంజూరు చేసిందన్నారు. మొత్తం 3,039 మంది విద్యార్థులకు తొలి విడతగా.. ఒక్కో విద్యార్థికి రూ.3,000 చొప్పున నిధులను విడుదల చేసిందని తెలిపారు.
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ రిజర్వేషన్లపై ఫిర్యాదు

పాలకీడు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్క పంచాయతీకి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదంటూ నక్క శ్రీనివాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బీసీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లోనూ జనరల్ రిజర్వేషన్లు కేటాయించకపోవడం అన్యాయమని ఆరోపించారు. జీఓ 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదని ఆయన పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.


