News March 22, 2025

తిరుపతి కలెక్టర్ చేతుల మీదుగా వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ

image

వరల్డ్ వాటర్ డే సందర్భంగా శనివారం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా కలెక్టరేట్‌లో వాటర్ బ్రోచర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని తాగాలని తెలిపారు. అనంతరం IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్‌ను కనుగొన్న సైంటిస్ట్ డాక్టర్ షిహాబుద్దీన్‌ను కలెక్టర్ అభినందించారు.

Similar News

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్‌లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్‌లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్‌పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.

News December 10, 2025

పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

image

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.

News December 10, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.