News April 10, 2025
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్కు మహర్దశ

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్లు, 327 చిన్న బ్రిడ్జ్లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
Similar News
News November 19, 2025
నరసరావుపేట: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు

కోడి గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒకొక్క కోడిగుడ్డు రూ. 8 ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేక్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. గత నెలలో ఒక్క కోడిగుడ్ల ధర రూ .7 వరకు ఉండేది. ఈ నెలలో రూ. 8 లు, డజను కోడిగుడ్లు రూ. 98 వరకు పలుకుతుంది. ఇటీవల కురిసిన వర్షాలు, డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు.
News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.


