News April 10, 2025

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్‌కు మహర్దశ 

image

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్‌‌లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్‌లు, 327 చిన్న బ్రిడ్జ్‌లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.

Similar News

News November 21, 2025

7వ తరగతి అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.

News November 21, 2025

ఖమ్మం: హత్య జరిగి 21 రోజులు.. నిందితుల జాడేదీ?

image

చింతకాని(M) పాతర్లపాడు మాజీ సర్పంచి, CPM నేత సామినేని రామారావు హత్య జరిగి 21 రోజులు అవుతున్నా, సుపారీ గ్యాంగ్‌కు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించలేకపోతున్నారు. హంతకులు ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇది రాజకీయ హత్యేనని, దర్యాప్తు జాప్యానికి అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని CPM నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఈనెల 25న దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

News November 21, 2025

వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

image

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తొంది‌. కార్పొరేషన్‌గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతోంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్‌లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.