News April 10, 2025
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్కు మహర్దశ

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్లు, 327 చిన్న బ్రిడ్జ్లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
Similar News
News October 17, 2025
ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం లేదు: డిప్యూటీ కమిషనర్

ఉమ్మడి జిల్లాలో ఎటువంటి కల్తీ మద్యం లేదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి అన్నారు. విజయనగరంలోని శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో తమ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారని, ఎక్కడ కల్తీ మద్యం లేదని చెప్పారు. వైన్ షాపులు, బార్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రజలకు సురక్షతమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు.
News October 17, 2025
కామారెడ్డి: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్కు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
శ్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు DRDA వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగంచేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీనిధి గోడ పత్రికలను కలెక్టర్తో కలిసి పీడీ నరసయ్య ఆవిష్కరించారు. శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల మహిళలు తమ జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఇతర ఆర్థికఅవసరాలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.