News April 10, 2025
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్కు మహర్దశ

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్లు, 327 చిన్న బ్రిడ్జ్లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
Similar News
News November 29, 2025
ప్రకాశం: ‘అభ్యంతరాలు ఉంటే తెలపండి’

ప్రకాశం జిల్లాలో కలవనున్న కందుకూరు, అద్దంకి డివిజన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలను, కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 2 మండలాలను కందుకూరులోకి కలుపుతూ.. అలాగే కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని, దీనికై సూచనలు ఇవ్వాలన్నారు.
News November 29, 2025
ప్రకాశం: ‘అభ్యంతరాలు ఉంటే తెలపండి’

ప్రకాశం జిల్లాలో కలవనున్న కందుకూరు, అద్దంకి డివిజన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలను, కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 2 మండలాలను కందుకూరులోకి కలుపుతూ.. అలాగే కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని, దీనికై సూచనలు ఇవ్వాలన్నారు.
News November 29, 2025
NZB: టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ-పోల్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే వివరాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.


