News April 10, 2025

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్‌కు మహర్దశ 

image

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్‌‌లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్‌లు, 327 చిన్న బ్రిడ్జ్‌లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.

Similar News

News February 15, 2026

నెల్లూరు: శివరాత్రి జాగరణ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

image

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు, పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తులో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 15, 2026

జగిత్యాల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌!

image

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్‌, జీవన్‌రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్‌ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.

News February 15, 2026

మార్కులు మీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు: వినీత్

image

జీవితంలో చదువుకు, సక్సెస్‌కు సంబంధం లేదని HCL మాజీ సీఈవో వినీత్ నాయర్ స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డు పరీక్షలు, మార్కులే జీవితాన్ని డిసైడ్ చేస్తే 50 శాతం మంది సీఈవోలు నిరుద్యోగులుగా ఉంటారన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలని, మార్కుల గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులకు ఈ కామెంట్లు ప్రేరణగా నిలుస్తాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.