News February 5, 2025
తిరుపతి కార్పొరేటర్లపై వైసీపీ బహిష్కరణ వేటు

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో YCPకి వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా YCP అధ్యక్షుడు భూమన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన తిరుపతి 10వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డిసాయి ప్రతాపరెడ్డి, 11వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవల్లిక, 32, 33, 43 వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి బహిష్కరించారు.
Similar News
News October 22, 2025
NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
News October 22, 2025
మహబూబ్నగర్: కురుమూర్తి రాయుడి పేరు వెనుక కథ ఇదీ..!

కురుమూర్తి క్షేత్రంలో కొలువైన శ్రీహరి పేరుకు మూలం కురుమతి అని పండితులు భావిస్తున్నారు. “కురు” అనగా ‘చేయుట’, “మతి” అనగా ‘తలచుట’ అని అర్థం. అంటే, కోరిన కోరికలు తీర్చే తలంపు ఈ క్షేత్రానికి ఉందని అర్థం. కాలక్రమంలో ఈ పేరు “కురుమూర్తి”గా మారిందని, ఇక్కడ శ్రీహరి మూర్తి రూపంలో స్వయంగా కొలువై ఉండటంతో ఈ పేరు ప్రసిద్ధి చెందిందని సాహిత్యకారులు విశ్లేషిస్తున్నారు. నేడు స్వామివారి కళ్యాణం జరిగింది.
News October 22, 2025
హనుమకొండలో ధాన్యం అక్రమాలు

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.


