News February 5, 2025

తిరుపతి కార్పొరేటర్లపై వైసీపీ బహిష్కరణ వేటు

image

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో YCPకి వ్యతిరేకంగా ఓటు వేసిన కార్పొరేటర్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా YCP అధ్యక్షుడు భూమన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన తిరుపతి 10వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డిసాయి ప్రతాపరెడ్డి, 11వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవల్లిక, 32, 33, 43 వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి బహిష్కరించారు.

Similar News

News December 13, 2025

రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

సైబర్‌ నేరగాళ్లపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదం

image

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.