News April 9, 2025
తిరుపతి: కొత్త అధికారులు వీళ్లే..!

తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా బి.రాజా సోము, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా డి.రాజేంద్రకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈక్రమంలో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు శాఖల అభివృద్ధికి కృషి చేయాలని వారికి కలెక్టర్ సూచించారు.
Similar News
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.
News November 28, 2025
కొత్తగూడెం: నేర సమీక్ష జరిపిన ఎస్పీ రోహిత్ రాజు

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఓటర్లను నగదు, మద్యం వంటి వాటితో ప్రలోభ పెట్టేవారిపై పటిష్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.


