News June 2, 2024
తిరుపతి: కౌంటింగ్ ఏజెంట్లు ఎలా కూర్చోవాలో తెలుసా..!

4న జరిగే ఎన్నికల కౌటింగ్కు సంబంధించి హాజరయ్యే పార్టీ ఏజెంట్లు ఎలా పడితే అలా కూర్చోవడం కుదరదని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా దేశ గుర్తింపు కలిగిన పార్టీ, రాష్ట్ర గుర్తింపు కలిగిన పార్టీ, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కూర్చోవడంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 23, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 22, 2025
ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.
News November 22, 2025
ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.


