News June 2, 2024
తిరుపతి: కౌంటింగ్ ఏజెంట్లు ఎలా కూర్చోవాలో తెలుసా..!

4న జరిగే ఎన్నికల కౌటింగ్కు సంబంధించి హాజరయ్యే పార్టీ ఏజెంట్లు ఎలా పడితే అలా కూర్చోవడం కుదరదని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా దేశ గుర్తింపు కలిగిన పార్టీ, రాష్ట్ర గుర్తింపు కలిగిన పార్టీ, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కూర్చోవడంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News September 14, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 13, 2025
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.