News June 14, 2024
తిరుపతి: గంజాయి విక్రేతల అరెస్ట్

బాలుడితో పాటు ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ ఎస్సై షేక్షావలి తెలిపారు. గురువారం తిరుపతి గ్రామీణ మండలం రామాంజుపల్లి కూడలి వద్ద అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కర్ణాటకకు చెందిన జేహెచ్ భరత్, బెంగళూరు నగరానికి చెందిన కార్తీక్ అంజన్ కుమార్తోపాటు మరో బాలుడి నుంచి రూ.7,500 విలువైన 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
News May 7, 2025
చిత్తూరు: 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం అధికమవుతోంది. శుక్రవారం 4 మండలాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నగరి, తవణంపల్లెలో 41.2, శ్రీరంగరాజపురం-41, సదుం-40.7, చిత్తూరులో 39.4, బంగారుపాలెం-38.7, యాదమరి-38.6, పులిచెర్ల, పూతలపట్టు, సోమల, వెదురుకుప్పం-38.4, రొంపిచెర్ల-38.1, గంగవరం, పెద్దపంజాణి-38, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురంలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.