News May 10, 2024

తిరుపతి చేరుకున్న నాగబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రోడ్‌షో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి నాగబాబుకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఈ రోడ్ షోలో పాల్గొంటారు.

Similar News

News September 18, 2025

అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

image

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News September 18, 2025

విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

image

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.

News September 17, 2025

భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి

image

కుప్పం (M) బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.