News May 10, 2024

తిరుపతి చేరుకున్న నాగబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రోడ్‌షో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి నాగబాబుకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఈ రోడ్ షోలో పాల్గొంటారు.

Similar News

News October 20, 2025

చిత్తూరులో PGRS రద్దు

image

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.

News October 20, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.