News March 16, 2025
తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు వేళాయె• మార్చి 17 నుంచి పదవ తరగతి పరీక్షలు• తిరుపతి జిల్లాలో 28,656 మంది పదవ తరగతి విద్యార్థులు• జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల ఏర్పాటు• 30 సిట్టింగ్ స్వ్కాడ్లు, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు• ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు• పరీక్ష సమయం: ఉ.9:30 నుంచి మ.12:30 వరకు• పరీక్షకు ఒక రోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి
Similar News
News November 23, 2025
ANU: పీజీ విద్యార్థులకు అలర్ట్..!

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (దూరవిద్య) పరిధిలో జూలై, ఆగస్టు 2025లో జరిగిన MSC మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ ఒకటో సెమిస్టర్ పరీక్షల రీ-వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ-వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మరిన్ని వివరాలకై https://anucde.info/ResultsJAug25.aspలో చెక్ చేయాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News November 23, 2025
మద్దతు ధరతో ధాన్యం సేకరణకు రంగం సిద్ధం: కలెక్టర్

మద్దతు ధరతో ధాన్యం సేకరించడానికి బాపట్ల జిల్లా రంగం సిద్ధం చేశామని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం అన్నారు. గ్రేడ్-ఏ క్వింటా రకం ధాన్యం ధర రూ.2,389లు కాగా, సాధారణ రకం ధాన్యానికి క్వింటా రూ.2,369లుగా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు రూ.69లు ధర పెరిగిందన్నారు. జిల్లాలో రెండు లక్షల 91 వేల 109 ఎకరాల్లో ఒక లక్ష 66 వేల 553 మంది రైతులు వరి పంటను సాగు చేశారన్నారు.
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


