News January 30, 2025
తిరుపతి జిల్లాలో పెన్షన్లకు రూ.112.19 కోట్లు

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది పెన్షన్ దారులకు రూ.112.19 కోట్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని తెలిపారు.
Similar News
News February 25, 2026
ప్రశాంతంగా తొలిరోజు ఇంటర్ పరీక్షలు: DIEO

జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మదార్ గౌడ్ తెలిపారు. అన్ని మండలాల్లో మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కేటగిరి 3317 విద్యార్థులకు, 3237 విద్యార్థులు, ఒకేషనల్ 1042 విద్యార్థులకు 955 విద్యార్థులు మొత్తం 4359 విద్యార్థుల గాను 4192 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
News February 25, 2026
2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 నుంచి ఎంపికైన అధికారులందరినీ రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కాగా 2018 నోటిఫికేషన్ ద్వారా 167 మంది గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు.
News February 25, 2026
ప్రగతిలో మార్టూరు అగ్రగామిగా నిలవాలి: కలెక్టర్

నెల రోజుల్లో మార్టూరు మండలం అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మండల స్థాయి అధికారులు సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ర్యాంకింగ్ ఇచ్చి అభినందిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల కోసం తప్పనిసరిగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


