News March 18, 2025

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ సాగు ఎంతంటే?

image

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, పురోగతి, లబ్ధిదారుల వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గురించి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో మంగళవారం ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి అమలులో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు.

Similar News

News December 9, 2025

శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

News December 9, 2025

వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్‌’.. స్పష్టత ఏది?

image

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 9, 2025

వన్డే క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా వాసి

image

ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు BCCI ఆధ్వర్యంలో ముంబైలో జరగనునున్న అండర్-19 ఉమెన్స్ వన్డే టోర్నీకి కర్నూలు జిల్లా వెల్దుర్తి(M) ఎల్.బండకు చెందిన కౌసల్య బాయి ఎంపికైంది. కర్నూలు క్రికెట్ ఆసోషియేషన్ శిక్షకుడు శ్రీనివాసులు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు. కౌసల్య ప్రస్తుతం కర్నూలులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.